Wednesday, May 8, 2024

అలిపిరి బాంబు దాడి కేసులో నిర్దోషులుగా ముగ్గురు నిందితులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడి కేసులో ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ 4వ అదనపు జిల్లా తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రామ్  మోహన్ రెడ్డి, నరసింహ రెడ్డి, చంద్ర అనే మాజీ నక్సలైట్‌ల ను దోషులుగా నిర్దారిస్తూ 4 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ 2014లో కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై సవాల్ చేస్తూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పటి నుంచి ఈ కేసులో వాదనలు కొనసాగుతూ వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం ముగ్గురు ముద్దాయిలను నిర్ధోషులుగా కోర్టు తీర్పు వెలువరించింది.

2003 అక్టోబర్‌లో సిఎం హోదాలో తిరుమల స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళుతున్న చంద్రబాబుపై తిరుపతి సమీపంలోని అలిపిరి వద్ద బాంబు దాడి జరిగిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News