Sunday, May 5, 2024

సిఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: సిఎం రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సిఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగ రాకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి సూచించారు. సిఎం కాన్వాయ్‌లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్‌ జామ్ లు లేకుండా, ట్రాఫిక్‌ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు.

ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సిఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా, ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News