Friday, May 3, 2024

ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నీ వాయిదా వేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: తెలంగాణలో అన్ని ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. క‌రోనా వైరస్ (కోవిడ్-19) మ‌హ‌మ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విజృంభిస్తుండ‌టంతో ముఖ్యమంత్రి కెసిఆర్ లాక్‌డౌన్ ను ఈ నేల 30వ తేదీ వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో ఎంసెట్ స‌హా మేలో జ‌రుగాల్సిన ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌న్నింటినీ వాయిదా వేస్తున్న‌ట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఏప్రిల్ 30 తర్వాత రాష్ట్ర పరిస్థితులను బట్టి, ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఛైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు గడువు మే 5వ తేదీ వరకు ఉన్నట్లు ఆయన తెలిపారు. కరోనా వైరస్ ఎఫెక్ట్ తో ఎపి ప్రభుత్వం కూడా అన్ని ప్రవేశ పరీక్షలను వాయిదా వేసింది.

All Entrance Exams 2020 Postponed in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News