Thursday, May 2, 2024

అన్ని సమస్యలు పరిష్కరిస్తాము

- Advertisement -
- Advertisement -

సిద్ధూ లేఖపై పంజాబ్ సిఎం చన్ని

All Problems solved by Channi

 

చండీగఢ్: అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని, పార్టీ అజెండాను అమలు చేసి తీరతామని పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్ని సోమవారం స్పష్టం చేశారు. పంజాబ్ పిసిసి అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూ తాను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసిన లేఖను ఆదివారం బహిర్గతం చేసిన అనంతరం ముఖ్యమంత్రి చన్ని దీనిపై స్పందించారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి చన్ని సిద్ధూకు సన్నిహితుడిగా పేరున్న మంత్రి పర్గత్ సింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిద్ధూ కూడా పాల్గొన్నారు. పార్టీ అజెండాలో 13 సూత్రాలో లేక 18 సూత్రాలో లేక 24 సూత్రాలో&ఎన్ని సూత్రాలైనా ఉండనివ్వండి&వాటిని తమ ప్రభుత్వం అమలుచేస్తుందని చన్ని తెలిపారు. సిద్ధూ లేవనెత్తిన సమస్యలన్నిటినీ కూడా పరిష్కరిస్తామని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి తాను నిర్ణయాలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News