Wednesday, May 8, 2024

ఆత్మ బలిదానాలన్నీ కాంగ్రెస్ హత్యలే: కవిత

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నిజామాబాద్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరుల స్తూపం వద్ద విద్యార్థులు ఆందోళన చేస్తున్న వీడియోను ఎక్స్ లో ఎంఎల్‌సి కవిత పోస్టు చేశారు. అమరవీరుల కుటుంబాలు క్షమాపణ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాయి. ఎంతోమంది యువత అమరవీరులు కావడానికి కారణం గాంధీ కుటుంబమే.

అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ చేసిన మోసాన్ని గుర్తు చేసేందుకు నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు అమరవీరుల స్థూపం దగ్గర నిరసన తెలిపారని కవిత వెల్లడించారు. ఆత్మ బలిదానాలన్నీ కాంగ్రెస్ హత్యలే అంటున్న నిజామాబాద్ విద్యార్థులు, యువత అంటున్న మాటలను వినాలని రాహుల్ గాంధీకి ఎంఎల్‌సి కవిత సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News