- Advertisement -
హైదరాబాద్: గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, మార్కుల జాబితాను రద్దు చేస్తూ.. ఇటీవల వెలువడిన తీర్పుపై హైకోర్టులో మరో అప్పీల్ దాఖలైంది. గ్రూప్-1 ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థి ఒకరు ఈ అప్పీల్ను దాఖలు చేశారు. జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గతంలో ఇచ్చిన తీర్పును కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సదరు అభ్యర్థి అప్పీల్ను ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారణకు స్వీకరించింది. టిజిపిఎస్సి (TGSPSC) కూడా అప్పీల్ దాఖలు చేశారని న్యాయవాది పేర్కొనగా.. ఈ రెండు పిటిషన్లు కలిపి విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.
Also Read : ట్రైబ్యునల్ ముందు రాష్ట్ర వాదనలు స్వయంగా పరిశీలిస్తా: ఉత్తమ్
- Advertisement -