Thursday, May 2, 2024

కరోనా నుండి కోలుకున్న ఎపి గవర్నర్

- Advertisement -
- Advertisement -

AP Governor recovering from Covid-19

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆరోగ్యం మెరుగు పడినట్లు ఎఐజి వైద్య వర్గాలు తెలిపాయి. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగానే ఈనెల 17న హైదరాబాద్‌లోని ఎఐజి హాస్పిటల్‌లో చేరిన ఎపి గవర్నర్ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. సాధారణంగానే ఆక్సిజన్ తీసుకుంటూ వేగంగా కోలుకుంటున్నట్లు వైద్యులు నిర్ధారించారని గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా తెలిపారు. ప్రాణాధారాలను కొనసాగిస్తున్నారని, ఎఐజి హాస్పిటల్స్ కు చెందిన ఉన్నత స్థాయి వైద్యుల బృందం నిరంతరం గవర్నర్ హరిచందన్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుందని సిసోడియా పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News