- Advertisement -
రిపబ్లిక్ టివి మరో ఎగ్జిక్యూటివ్ అరెస్ట్
ముంబయి: రిపబ్లిక్ టివి ఎడిటర్ఇన్చీఫ్ అర్నాబ్ గోస్వామి మధ్యంతర బెయిల్ కోసం మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018లో ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్నాయక్తోపాటు ఆయన తల్లి ఆత్మహత్యకు కారణమయ్యారని ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు ఈ నెల 4న అర్నాబ్ను అరెస్ట్ చేశారు. అర్నాబ్తోపాటు ఈ కేసులోని మరో ఇద్దరు నిందితులు సోమవారం బాంబే హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ వేయగా తిరస్కరించింది. టిఆర్పి రిగ్గింగ్ స్కాం కేసులో రిపబ్లిక్ మీడియా నెట్వర్క్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఘనశ్యామ్సింగ్ను ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో క్రైంబ్రాంచ్ అరెస్ట్ చేసినవారి సంఖ్య 12కు చేరింది. టిఆర్పి రిగ్గింగ్పై హన్సా రీసెర్చ్ గ్రూప్ ఇచ్చిన సమాచారంతో గత నెల బార్క్ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.
- Advertisement -