Wednesday, May 8, 2024

పేకాట రాయుళ్ల అరెస్టు

- Advertisement -
- Advertisement -

మేడిపల్లి: మండలంలోని కట్లకుంట గ్రామ శివారులో పేకాట ఆడుతున్న వారిని పట్టుకున్నట్లు మేడిపల్లి ఎస్‌ఐ చిరంజీవి శుక్రవారం తెలిపారు. కట్లకుంట గ్రామ శివారులో 11 మంది వ్యక్తులు పేకాట ఆడుతుండగా వారిలో ఐదుగురు వ్యక్తులను పట్టుకుని వారి వద్ద నుంచి రూ.11,400, 7 మోటార్ సైకిళ్లు పట్టుబడినట్లు తెలిపారు. మరో ఆరుగురు వ్యక్తులు పరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు. రాపర్తి హన్మాండ్లు, గుర్రాల వేణుగోపాల్, మంతెన మహిపాల్, ఎలిగేటి కొండయ్య, బండ్ల నరేష్, కటికె శ్రీను, ఎడమల రాజేశ్వర్‌రెడ్డి, సురకంటి రవి, బద్దం గంగారెడ్డి, రఘు, నరేష్‌లు పేకాట ఆడినట్లుగా పోలీసులు గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News