కాన్పూర్: రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనతను సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో ఆరు వికెట్లను పడగొట్టడం ద్వారా అశ్విన్ మరో రికార్డును తన పేరిట నమోదు చేసుకున్నాడు. భారత మరో స్టార్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పేరిట ఉన్న 417 వికెట్ల మైలురాయిని అశ్విన్ అధిగమించాడు. అత్యధిక వికెట్లను తీసిన మూడో బౌలర్గా హర్భజన్ పేరిట ఉన్న రికార్డును అశ్విన్ తిరగరాశాడు. అశ్విన్ 80 టెస్టుల్లోనే 419 వికెట్లు పడగొట్టి మూడో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కపిల్దేవ్ (434), అనిల్ కుంబ్లే (619) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. త్వరలోనే అశ్విన్ కపిల్దేవ్ రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా ఉన్న కుంబ్లే రికార్డును అశ్విన్ అందుకుంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం.