Sunday, April 28, 2024

మమత నేతృత్వంలోని కూటమి చేతిలో బిజెపికి ఓటమి తప్పదు

- Advertisement -
- Advertisement -

Assam leader Akhil Gogoi Mamata-led alliance

గువహతి: బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రాంతీయ పార్టీల కూటమి ద్వారా 2024 ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి అధికారం కోల్పోవడం ఖాయమని రాయిజర్‌దళ్ అధినేత అఖిల్‌గొగోయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలి అసోం ఎన్నికల్లో ఎంఎల్‌ఎగా ఎన్నికైన గొగోయ్‌ని తమ పార్టీలో విలీనం కావాల్సిందిగా టిఎంసి ఆహ్వానించింది. తనకు టిఎంసి అసోం అధ్యక్ష బాధ్యతలు ఇస్తానని మమత హామీ ఇచ్చారని గొగోయ్ తెలిపారు. తమ పార్టీని విలీనం చేసే అంశంలో టిఎంసితో ఇప్పటికే మూడుదఫాలు చర్చలు జరిపామని ఆయన తెలిపారు. దీనిపై తమ పార్టీ కార్యనిర్వాహకవర్గం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News