Sunday, April 28, 2024

యువకుడిపై హత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Assassination

 

మనతెలంగాణ, హైదరాబాద్ : కుటుంబ కలహాలు యువకుడిపై హత్యాయత్నం చేసేందుకు దారితీసిన సంఘటన చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం… చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజంపురాకు చెందిన అబ్దుల్ రెహమాన్‌పై నలుగురు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. దాడి చేసిన వారు యువకుడి బంధువులేనని తెలిసింది. తీవ్రంగా గాయపడిన బాధితుడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడి పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలిసింది. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంబర్‌పేటకు చెందిన దస్తగిరికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు తెలిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News