Thursday, March 28, 2024

ములుగు జిల్లాలో అగ్నిప్రమాద బాధితులకు సాయం

- Advertisement -
- Advertisement -

Assistance to fire victims in Mulugu district: Minister satyavathi

ములుగు జిల్లా అగ్ని ప్రమాద బాధితులకు నష్ట పరిహారం చెల్లింపు, వెంటనే పునరావాస చర్యలు

గిరిజన శాఖ నుంచి ఒక్కో కుటుంబానికి 40వేలు, రెవెన్యూ నుంచి 15వేల ఎక్స్ గ్రేషియా

25 కిలోల బియ్యం, 1800 విలువైన వంట సామాగ్రి కిట్

కుదుట పడే వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు

అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: ములుగు జిల్లా మండపేట మండలం, శనిగకుంట గ్రామంలో అగ్నిప్రమాదానికి గురై 21 గుడిసెలు దగ్ధం అయి 40 కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో రాష్ట్ర గిరిజన, స్త్రీ–శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వెంటనే వారికి పునరావాస చర్యలు చేపట్టి, నష్ట పరిహారం అందిస్తున్నట్లు ప్రకటించారు. గుడిసెలు కాలిపోవడంపై నిన్న తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి, వెంటనే స్పందించడంతో ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టగలిగామన్నారు. నేడు వారిని ఆదుకోవడంపై అధికారులతో చర్చించారు. గిరిజన సంక్షేమ శాఖ నుంచి 40 కుటుంబాలకు 25వేల రూపాయల చొప్పున వెంటనే ఎక్స్ గ్రేషియా అందిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి నష్టపోయిన కుటుంబాలకు 15వేల రూపాయల నష్టపరిహారం, 25 కిలోల బియ్యం, 1800 రూపాయల విలువైన 12 వస్తువుల వంట సామాగ్రి కిట్ అందిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదంలో గుడిసెలు పూర్తిగా కాలిపోవడంతో వారు కుదటపడే వరకు ప్రభుత్వమే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, వారికి అన్ని వసతులు కల్పిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు కార్యదర్శులు, కలెక్టర్, సంబంధిత అధికారులతో మాట్లాడి ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, అధైర్యపడవద్దని వారికి ధీమా కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News