Thursday, May 2, 2024

ఆప్ ఎంఎల్‌ఎ కార్యాలయంపై దాడి

- Advertisement -
- Advertisement -

Attack on AAP MLA's office

 

న్యూఢిల్లీ : ఢిల్లీ జల్‌బోర్డ్ వైస్‌ఛైర్మన్ రాఘవ్ చద్దా కార్యాలయాన్ని గురువారం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. రైతుల ఆదోళనకు మద్దతు ఇవ్వడమే ఈ దాడికి కారణంగా బయటపడింది. రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కి చెందిన ఎమ్‌ఎల్‌ఎ. ఆమ్‌ఆద్మీ పార్టీ రైతుల ఆందోళనకు మద్దతు ఇస్తోంది. బిజెపియే ఈ దాడికి పాల్పడిందని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించింది. దాదాపు 250 మంది ఆందోళన కారులు ఈ దాడిలో పాల్గొన్నారని, కార్యాలయం అద్దాలు, తలుపులు పగుల గొట్టడమే కాక, సిబ్బందిపై దాడి చేశారని రాఘవ్ చద్దా ఆరోపించారు. ఈ దాడిని ఆప్ ప్రభుత్వ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఖండించారు. ఇలాంటి దాడులకు తాము భయపడబోమని, ఆఖరి శ్వాస ఉన్నంతవరకు రైతులకు తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News