Friday, May 3, 2024

ప్రియుడిపై దాడి.. మూటకట్టి మురికికాలువలో పడేశారు…

- Advertisement -
- Advertisement -

Attack on man over affair with married woman

 

అహ్మదాబాద్: సోదరితో వివాహేతర సంబందం పెట్టుకున్నాడని ఓ వ్యక్తిపై దాడి చేసిన అనంతం బస్తాలో మూటగట్టి డ్రైనేజీ పైపులో పడేసిన సంఘటన గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చిక్లాడ్ గ్రామానికి చెందిన జీవన్ రాథోడ్ అనే వ్యక్తి లక్ష్మి అనే వివాహితతో అక్రమ సంబందం పెట్టుకున్నాడు. లక్ష్మితో ప్రతి రోజూ ఫోన్‌లో మాట్లాడుతూ మెసేజ్‌లు పెడుతూ ప్రేమాయణం కొనసాగించేవాడు. దీంతో లక్ష్మి సోదరులు ధర్మేంద్ర పార్మర్, సంజయ్ పార్మర్‌లకు ఈ విషయం తెలియడంతో పలుమార్లు రాథోడ్‌ను బెదిరించారు. దీంతో రాథోడ్ ఎప్పుడూ వాళ్ల బెదిరింపులను పట్టించుకోలేదు. శనివారం మాట్లాడుకుందామని రాథోడ్‌ను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అనంతరం సంజయ్, ధర్మేంద్ర అతడిపై దాడి చేశారు. అతడు స్పృహతప్పిపడిపోవడంతో బస్తాలో కట్టి దగ్గరలో డ్రైనేజీలో పైపులో పడేశారు. 24 గంటల తరువాత రాథోడ్‌కు స్పృహ రావడంతో అతడి కేకలు విన్న స్థానికులు బయటకు తీశారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో రాథోడ్ ఫిర్యాదు చేయడంతో నిందితులపై హత్యాయత్నం, కిడ్నాప్‌ల కింద కేసులు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News