Wednesday, May 15, 2024

ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: అరుణ్ జైట్లీ స్టేడియంలో బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 172 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఉస్మాన్ ఖవాజా 81 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ట్రావిస్ హెడ్ 12 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. అలెక్స్ కారే షమీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో పీటర్ హడ్సకాంబ్ (31), ప్యాట్ కమ్నీస్ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లు తీయగా షమీ రెండు వికెట్లు తీయగా రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News