Tuesday, May 14, 2024

ఆసీస్ 133/6

- Advertisement -
- Advertisement -

Australia scored 136 runs for six wickets

మెల్‌బోర్న్: భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజూ ఆట ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 66 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. దీంతో భారత్ జట్టు రెండు పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్ల రెండు అంకెల స్కోర్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. మాథ్యూ వాడే 40 పరుగులు, మార్నస్ లాబుసింగే 28 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ట్రావిస్ హెడ్ (17), స్టీవ్ స్మిత్(08), జోయ్ బర్న్(04), టిమ్ పేయిన్(01) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో కామెరూన్ గ్రీన్(17), పాట్ కమ్నీస్(15) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా రెండు వికెట్లు పడగొట్టగా జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహ్మాద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ తలో ఒక వికెట్ తీశారు. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉంది.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 195

భారత్ తొలి ఇన్నింగ్స్: 326

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News