Monday, April 29, 2024

అయోధ్య రామమందిరం హిందువులకు చెందుతుంది

- Advertisement -
- Advertisement -

అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య ఎలాంటి తేడా కనిపించడం లేదు
దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్:  అయోధ్య రామమందిరం హిందువులకు చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దావోస్ పర్యటనలో ఉన్న ఆయన తాజాగా ఓ ప్రైవేటు చానల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో తెలిపారు. అయోధ్య రామమందిరానికి బిజెపికి ఎలాంటి సంబంధం లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపి ‘మత రాజకీయాలు’ ఆడుతోందని ఆయన విమర్శించారు.

తాను ఏదో ఒక రోజు అయోధ్యలోని రామ మందిరాన్ని సందర్శించాలనుకుంటున్నానన్నారు. తెలంగాణలోని భద్రాచలంలో ఉన్న రామమందిరాన్ని తాను దర్శించుకునేవాడినని ఆయన గుర్తు చేశారు. అయోధ్యకు, భద్రాచలం రామాలయానికి మధ్య తనకు ఎలాంటి తేడా కనిపించడం లేదన్నారు. ఐటీ, ఫార్మా రంగాలు బిఆర్‌ఎస్ హయాంలో ప్రారంభం కాలేదన్నారు. 1993లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైటెక్ సిటీకి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. 30 ఏళ్లుగా అభివృద్ధి కొనసాగుతోందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News