Tuesday, May 7, 2024

జనవరి 22న అయోధ్య రామ మందిరం ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో నిర్మాణమౌతున్న రామ మందిరం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్రమోడీకి ఆహ్వానం అందింది. వచ్చే ఏడాది జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధానిని ఢిల్లీలో కలిసి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మోడీని ఆహ్వానించారు. దీనికి మోడీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. “ ఈరోజు భావోద్వేగాలతో నిండిన రోజు. ఇటీవల శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు అధికారులు నన్ను కలవడానికి నా నివాసానికి వచ్చారు.

శ్రీరామ మందిర ప్రతిష్ఠాపన సందర్భంగా అయోధ్యకు రావాల్సిందిగా ఆహ్వానించారు. దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నా. నా జీవిత కాలంలో ఈ చారిత్రాత్మక సందర్భాన్ని చూడటం నా అదృష్టం” అని మోడీ ట్వీట్ చేశారు. ప్రధానితో సమావేశం తరువాత ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ మాట్లాడారు. జనవరి 22 న ఆలయం గర్భగుడిలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్టు వెల్లడించారు. జనవరి 14న మకర సంక్రాంతి తర్వాత రామలల్లా ప్రతిష్ఠాపన ప్రక్రియను ప్రారంభించి , 10 రోజుల పాటు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News