Thursday, May 2, 2024

ఎపిలో బద్వేలు ఎంఎల్‌ఎ మృతి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌ః ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేలు వైఎస్సార్‌సిపి ఎంఎల్‌ఎ డాక్టర్ వెంకట సుబ్బయ్య ఆదివారం మృతి చెందాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతు వెంకటసుబ్బయ్య కడపలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఎంఎల్‌ఎ వెంకట సుబ్యయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా సోమవారం ఉదయం కడపలో ప్రభుత్వ లాంఛనాలతో వెంకట సుబ్బయ్య అంత్యక్రియలు జరపనున్నారు. ఈక్రమంలో బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఆదివారం సాయంత్రం కడపలో ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య నివాసానికి చేరుకున్న సీఎం.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Badvel YSRCP MLA Venkata Subbaiah Died in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News