Sunday, May 5, 2024

గుజరాత్ రథయాత్రలో అపశృతి

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్ : జగన్నాథ రధయాత్ర సందర్భంగా మంగళవారం గుజరాత్‌లో అపశృతి చోటుచేసుకుంది. వార్షిక జగన్నాధ రథయాత్ర ఊరేగింపు దశలో స్థానిక దరియాపూర్ ప్రాంతంలో బాల్కనీ కూలి ఓ వ్యక్తి చనిపోయ్యాడు, ఐదుగురు గాయపడ్డారు. పాడుపడ్డ భవనం పైకి జనం చేరుకోవడంతో బాల్కనీ కూలిందని దీనితో కింద నిలబడ్డ వారికి ప్రమాదం వాటిల్లింది. గాయపడ్డ పలువురిని చికిత్సకు తరలించినట్లు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడి చికిత్సకు ఆసుపత్రికి తరలించిన వారిలో 36 సంవత్సరాల మెహుల్ పంచల్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News