Saturday, June 21, 2025

హైకోర్టులో బండి సంజయ్‌కు స్వల్ప ఊరట

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర హైకోర్టులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన నాలుగు కేసులు కొట్టివేయాలని బండి సంజయ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 14వ తేదీకి వాయిదా వేసింది. దీంతో పాటుగా కోర్టుకు హాజరు నుంచి బండి సంజయ్‌కు మినహాయింపు ఇచ్చింది.

కాగా, 2021 నవంబర్ 15వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అనుమతి లేకుండా భారీ వాహనాలతో ర్యాలీ నిర్వహించారని ఎన్నికల అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉండగా, ఇటీవల హైకోర్టు కొట్టివేసింది. కాగా సూర్యపేట జిల్లా పెన్‌పహడ్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదయిన కేసు న్యాయస్థానం కొట్టివేసిన విషయం విధితమే. ఈక్రమంలోనే మిగిలిన కేసులు కొట్టివేయాలని హైకోర్టులో బండి సంజయ్ పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News