Monday, May 20, 2024

అమిత్ షాతో బండి సంజయ్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ భేటీ అయ్యారు. అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగిన తర్వాత అమిత్ షాను సంజయ్ కలవడం ఇదే తొలిసారి. సోమవారం ఢిల్లీ వెళ్లిన ఆయన అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ అంశాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను అమిత్ షాకు సంజయ్ వివరించినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News