Friday, May 3, 2024

బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన…

- Advertisement -
- Advertisement -

Bathukamma to Screen on Burj Khalifa building

హైదరాబాద్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో మరోసారి బతుకమ్మ పండుగ ప్రపంచ దృష్టిని ఆకర్షించనుంది. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. శనివారం సాయంత్రం 9.40 గంటలకు, 10.40 గంటలకు రెండుసార్లు ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించనున్నారు. దీంతో ఒకేసారి దేశవిదేశాలకు చెందిన లక్ష మంది బుర్జ్ ఖలీఫా స్క్రీన్ పై బతుకమ్మ ను వీక్షించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బూర్జ్ ఖలీఫా మీద బతుకమ్మను ప్రదర్శించబోయే తెర( స్క్రీన్) ప్రపంచంలోనే అతి పెద్దది కావడం మరో విశేషం. బతుకమ్మ పండుగ ద్వారా మన సాంస్కృతి, ఖ్యాతిని ప్రపంచమంతటా చాటి చెప్పేందుకు ఎమ్మెల్సీ కవిత ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాయంత్రం దుబాయ్ లో జరగబోయే ఈ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రవాస తెలంగాణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. యూఏఈ ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు సైతం ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.

కాగా, 2004 జనవరి 6న బుర్జ్ ఖలీఫా నిర్మాణం మొదలవగా, 2020 జనవరి 4న ఈ భవనాన్ని ప్రారంభించారు. 829.8 మీటర్ల ఎత్తు గల ఈ భవనంలో మొత్తం 163 అంతస్తులున్నాయి. అత్యంత వేగంతో వెళ్లే 57 అధునాతన సాంకేతికతతో కూడిన లిప్టులను అమర్చారు.

Bathukamma to Screen on Burj Khalifa building

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News