Thursday, May 2, 2024

టీ20 కెప్టెన్ గా రోహిత్ శర్మ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 కెప్టెన్ గా ఇకనుంచి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐసిసి టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలిగిన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ లో భాగంగా నిన్న నమీబియాతో జరిగిన చివరి మ్యాచ్ అనంతరం ప్రస్తుతం కెప్టెన్ గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ప్రపంచకప్ కు ముందే కోహ్లీ తనకు కెప్టెన్ గా ఇదే చివరి టీ20 టోర్నమెంట్ అని ప్రకటించాడు. చెప్పినట్లుగానే కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో బిసిసిఐ టీ20 కెప్టెన్ బాధ్యతలను హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించింది. ఇక, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ ను నియమించింది. ఈ నెల 17 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు టీమిండియా, న్యూజిలాండ్ జట్టుతో మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ నుంచి టీమిండియాకు రోహిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో భారత్.. మూడు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.

BCCI Announces Rohit Name as T20 Captain of India

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News