Saturday, April 27, 2024

ఎపిలో కొత్తగా 231 కరోనా కేసులు..

- Advertisement -
- Advertisement -

AP Reports 231 new corona cased in 24 hours

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 30,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 231 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో మరో ఇద్దరు మృతి చెందగా, కొత్తగా 362మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,97,06,769 కు చేరగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,67,921 కు పెరిగింది. ఇప్పటి వరకు 20,49,961 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా 14,392 మంది ప్రాణాలు తీసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 3,233 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని బులెటిన్‌లో పేర్కొన్నారు.

AP Reports 231 new corona cased in 24 hours

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News