Wednesday, May 15, 2024

కెసిఆర్ చెప్పిన 13500 ఖాళీలు ప్రకటించాలి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద బిఎడ్, డిఎడ్ అభ్యర్థులు ఆందోళన చేపట్టడంతో పాటు కార్యాలయం ముట్టడికి యత్నించారు. ఐదు వేల టీచర్ పోస్టులే భర్తీ చేస్తామనటంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్ 13500 ఖాళీలు ప్రకటించారని వివరించారు. కెసిఆర్ చెప్పినట్టు 13500 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యర్థులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

Also Read: కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో పొగలు… తప్పిన ప్రమాదం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News