Thursday, May 2, 2024

శివసేన నుంచి షురూ..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మహారాష్ట్ర నుంచి బిఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారంనాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన దిలీప్ గోరె హైదరాబాద్‌లో బిఆర్‌ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.

దిలీప్ గోరే గతంలో బీడ్ మున్సిపల్ మేయర్‌గా పనిచేశారు. ప్రస్థుతం శివసేన పార్టీ బీడ్ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. వీరికి ఆ ప్రాంతంలో రాజకీయంగా గట్టి పట్టువుంది. వీరితో పాటు మహారాష్ట్ర చెరుకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, విద్యాధికుడు శివరాజ్ జనార్థన్ రావు భంగర్ తదితరులు బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ చేరికల సందర్భంగా ఎంఎల్‌ఎ జీవన్ రెడ్డి, మహారాష్ట్ర బిఆర్‌ఎస్ నేత మాజీ శాసనసభ్యుడు హర్షవర్దన్ జాదవ్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News