Thursday, May 2, 2024

భజరంగ్ కంచి పట్టు

- Advertisement -
- Advertisement -

Bhajrang Punia won the bronze medal

 

హైదరాబాద్ : పురుషుల రెజ్లింగ్‌లో భారత స్టార్ భజరంగ్ పునియా కాంస్య పతకం సాధించాడు. 65 కిలోల విభాగంలో పునియా అసాధారణ ప్రదర్శనతో కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. కాంస్యం కోసం జరిగిన పోరులో భారత కుస్తీ వీరుడు 80 తేడాతో కజకిస్థాన్ రెజ్లర్ దౌలత్‌ను చిత్తు చేశాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయక పోవడంతో భజరంగ్ పసిడి ఆశలు ఆవిరయ్యాయి. అయితే తాజాగా కాంస్యం కోసం జరిగిన పోరులో విజయం సాధించి ఊరట చెందాడు. టోక్యో క్రీడల రెజ్లింగ్‌లో ఇది భారత్‌కు రెండో పతకం. అంతకుముందు రవికుమార్ దహియా రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News