Thursday, May 2, 2024

పచ్చదనంతోనే.. సస్యశ్యామలం : పోచారం భాస్కర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పచ్చదనంతోనే పర్యావరణం బాగుంటుంది.. సకాలంలో వర్షాలు కురుస్తాయని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. ఆదివారం తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో భాస్కర్‌రెడ్డి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎంపి సంతోష్‌కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అందరు భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News