Tuesday, May 21, 2024

ఐఐటి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: బిహెచ్‌యు ఐఐటి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని లంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ముజాఫర్ నగర్ జిల్లా ఖాఖిడి గ్రామానికి చెందిన కుల్దీప్ సింగ్ అనే విద్యార్థి బిహెచ్ యు ఐఐటిలో మ్యాథ్స్‌లో రిసెర్స్ స్కాలగా విద్యనభ్యసిస్తున్నాడు. వారణాసిలోని బిహెచ్ యులో ఎస్‌ఎన్ బాయ్స్ హాస్టల్‌లోని రూమ్ నంబర్ 88లో ఉంటున్నాడు. సోమవారం తన రూమ్‌లో కుల్దీప్ ప్యాన్ ఉరేసుకున్నాడు. పక్కన ఉన్న రూమ్ విద్యార్థులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హాస్టల్‌కు చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ లేఖ లభించలేదని పోలీసులు వెల్లడించారు. మానసిక ఒత్తిడితోనే అతడు ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్‌లో కుల్దీప్ పెళ్లి చేసుకున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

Also Read: కెసిఆర్‌ను తిట్టి పైశాచికానందం పొందుతున్నారు: కెటిఆర్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News