- Advertisement -
పాట్నా: బిహార్ లో ఎన్డీఏ కూటమి మెజారిటీ మార్క్ (122)ను దాటింది. దీంతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖరారైంది. బిహార్ లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. అందులో 123 స్థానాల్లో ఎన్డీఏ గెలుపొందింది. ఎన్డీఏ కూటమికి, మహాకూటమి చివరి వరకు గట్టిపోటీ ఇచ్చింది. బిహార్ లో ఎల్ జేపి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది. అటు యుపిలో ఆరు స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. మల్హానిలో సమాజ్ వాది పార్టీ గెలిచింది. యుపిలో ఏడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి.
Bihar Election 2020 Results LIVE Updates
- Advertisement -