Monday, May 20, 2024

ఆ ఇద్దరు అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది: ధర్మపురి అరవింద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్ జోస్యం చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా వేల్పూరు బిజెపి అభ్యర్థి అర్వింద్ రోడ్ షోలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కీలక వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ పార్టీ నేతలే పడేసుకుంటారని తెలిపారు. ఈ ఎన్నికల్లో మోడీకి ప్రజలు ఓట్లు వేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు కాగానే ప్రభుత్వం పడిపోతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనావస్థకు చేరిందని స్పష్టం చేశారు. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పడిపోతుందని ఆయన వెల్లడించారు.

తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని ఆరోపించారు. ఐదేళ్లలో ఎంపిగా తనపై ఒక్క అవినీతి ఆరోపణ లేదన్న అర్వింద్ తన కంటే ముందు ఎంపిగా ఉన్న కవిత ఇప్పుడు జైలులో ఉన్నారని తెలిపారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలు వదిలేస్తా తప్ప తప్పు చేయనని వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్ కు పసుపు బోర్డు తీసుకొచ్చానని చెప్పుకొచ్చారు. రాష్ట్రం సహకరిస్తే జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టు ఏడాదిలోపు తెరుచుకోవచ్చని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున మన పనులు కావట్లేదని తెలిపారు. ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News