Friday, May 3, 2024

మహిళా కార్యకర్తపై బిజెపి ఎంఎల్ఎ అత్యాచారం…

- Advertisement -
- Advertisement -

BJP MLA Suresh rape on women

డెహ్రాడూన్: మహిళా కార్యకర్తపై బిజెపి ఎంఎల్‌ఎ అత్యాచారం చేసిన సంఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రం జ్వాలాపూర్ నియోజకవర్గంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సురేష్ రాథోర్ బిజెపి తరఫున జ్వాలాపూర్ నియోజక వర్గం నుంచి గెలుపొందాడు. అదే నియోజకవర్గంలోని ఓ గ్రామానికి చెందిన బిజెపి మహిళా కార్యకర్తపై సురేష్ అత్యాచారం చేశాడని ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అత్యాచారం విషయం బయటకు చెబితే చంపేస్తానని సదరు ఎంఎల్‌ఎ బెదిరించడంతో గతంలో ఈ విషయం చెప్పలేదని మహిళా వాపోయింది. ఈ విషయంపై బిజెపి ఎంఎల్‌ఎ సురేష్ స్పందించారు. తనపై రాజకీయంగా కుట్ర జరుగుతోందన్నారు. తనపై తప్పుడు కేసులు పెట్టించారన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి వాస్తవాలు బయట పెట్టాలని పోలీస్ అధికారులను ఎంఎల్ఎ కోరారు. కోర్టుకు, పోలీసులకు సహకరిస్తామని ఎంఎల్‌ఎ తెలిపారు. తనకు కూడా ప్రాణహాని ఉందన్నారు. కోర్టు ఆదేశాల మేరకు ఎంఎల్‌ఎ సురేష్‌పై ఐపిసి 376, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News