Tuesday, May 7, 2024

కొత్తవారికి టికెట్లు.. భగ్గుమన్న బిజెపి సీనియర్ నేతలు

- Advertisement -
- Advertisement -

BJP senior leaders Attack on party office in Kukatpally

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో భారతీయ జనతా పార్టీకి ఆశావాహుల సెగ తగిలింది. కూకట్‌పల్లి బిజెపి సీనియర్ నేతలను కాదని కొత్తవారికి కేటాయించడంపట్ల పలువురు నేతలు కార్యాలయం అద్దాలు, కుర్చీలు ధ్వసం చేసి తమ అసహనాన్ని ప్రదర్శించారు. గత 20 సంవత్సరాలుగా పార్టీలో కష్టపడి పని చేసే నాయకులను కాదని కొత్తవారికి కూకట్‌పల్లి నియోజకవర్గంలోని పలు టికెట్లను కేటాయించడంపై పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం పార్టీ శ్రేణులు, సీనియర్లు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. మేడ్చెల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన పన్నాల హరీష్‌రెడ్డి ఒక్కో డివిజన్ టికెట్టు 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నాడని ఆరోపించారు. హరీష్‌రెడ్డి, కిషన్‌రెడ్డి డౌన్, డౌన్ అంటూ నినాదాలను చూశారు. టికెట్లు అమ్ముకున్న నేతలందరూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ భ్రష్టుపట్టిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పార్టీ కోసం కష్ట పడే వారికి కాకా ఇతరులకు కేటాయిస్తే వారిని గెలిపించే ప్రసక్తేలేదన్నారు. కూకట్‌పల్లి బిజెపి కార్యాలయం వద్ద నిరసనలు చేస్తూ అద్దాలు ధ్వసం చేయడంతో అక్కడికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు యాంజల పద్మయ్య, బల్గూరి రంగారావు, కంచి మహేందర్ తదితరులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

BJP senior leaders Attack on party office in Kukatpally

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News