Tuesday, May 7, 2024

యువతను నిందిస్తారా?: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’కు విరుద్ధంగా ఆందోళన జరిగినప్పటికీ వెనక్కి తగ్గేదే లేదని రక్షణ శాఖ తెలిపింది. కాగా ఈ విషయంలో బిజెపి నేతలు చేస్తున్న వ్యాఖ్యలను మంత్రి కెటిఆర్ ఎద్దేవ చేశారు. ‘‘అగ్నిపథ్ పథకం కింద యువత చాకలి,మంగళి, డ్రయివర్, ఎలక్ట్రిషియన్ వంటి ఉపాధులు పొందొచ్చని మన రాష్ట్రానికి  చెందిన కేంద్ర కేబినెట్ మంత్రి ఒకరు ఘనంగా చెప్పారు. కాగా మరో్ బిజెపి నాయకుడు సెక్యూరిటీ గార్డుల నియామకంలో అగ్నివీరులకే ప్రాధన్యత ఇస్తాం అన్నారు. చేసేదంతా చేసి మళ్ళీ మోడీని అర్థం చేసుకోలేదని యువతను మీరు నిందిస్తారా?’’ అని ప్రశ్నించారు. ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News