Saturday, April 27, 2024

ఆ మూడు దేశాల ప్రయాణికులపై నిషేధానికి కేంద్రం అనుమతి కోరిన కర్నాటక

- Advertisement -
- Advertisement -

Bommai calls for travel ban on those coming from nations hit by Omicron

 

బెంగళూర్: దక్షిణాఫ్రికా, హాంకాంగ్, బోట్స్‌వానా నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించేందుకు కేంద్రం నుంచి అనుమతి కోరామని కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌బొమ్మై తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు ఆ దేశాల్లో నమోదు కావడంతో ఇప్పటికే యూరోపియన్ దేశాలు ఆంక్షలు విధించాయని ఆయన గుర్తు చేశారు. ఒమిక్రాన్ ప్రవేశించిన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు పంపించాలని ఆదేశించినట్టు ఆయన తెలిపారు. కేరళ నుంచి వచ్చే ప్రయాణికులకు నెగెటివ్ వస్తేనే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నామన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News