- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 22, 657 శాంపిల్స్ పరీక్షించగా178 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో 6 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ఇక, ఇదే సమయంలో 190 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,03,72,427 కు చేరుకోగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,624 కు పెరిగింది.. ఇక, 20,56,046 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా 14,438 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2,140 గా ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటిన్లో పేర్కొంది.
- Advertisement -