44మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
2019 నుంచి పార్టీ చేసుకుంటున్న యువకులు
హోమో సెక్స్వల్స్గా అనుమానం
హైదరాబాద్ : రేవ్పార్టీని భగ్నం చేసిన పోలీసులు 44 మందిని ఆదివారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో మద్యం, హుక్కా బాటిళ్ల, కండోమ్స్ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఇద్దరు హిజ్రాలు ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని కూకట్పల్లి, వివేక్నగర్లోని ఓ ఇంట్లో రేవ్ పార్టీ చేసుకుంటున్నట్లు సమాచారం వచ్చింది. వెంటనే మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులు రాకేష్ రెడ్డి, మహ్మద్ ఇమ్రాన్, బిస్వాల్ దయాల్(గే) కొంత మంది యువకులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకుని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. వివేక్నగర్లో 2019 నుంచి యువకులు ఇంటిని రూ.60,000 అద్దెకు తీసుకుని పార్టీ నిర్వహిస్తున్నారు. పార్టీకి వచ్చే వారి నుంచి నిర్వాహకులు రూ.300 తీసుకుంటున్నట్లు తెలిసింది.
ప్రతి శనివారం వీరు పార్టీ చేసుకుంటున్నట్లు స్థానికులు చెప్పారు. పెద్దగా సౌండ్ పెట్టుకోవడం, వారు వచ్చిన నప్పుడు ఆ ప్రాంతం మొత్తం వాహనాలతో నిండిపోవడంతో స్థానికులే పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. పెద్దగా సౌండ్ పెట్టడం, హుక్కా, మద్యం తాగి నృత్యాలు చేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టుబడిన వారంతా హోమో సెక్స్వల్గా పోలీసులు అనుమానిస్తున్నారు. నిర్వాహకులపై నిషేధిత హుక్కా వినియోగం కేసు నమోదు చేసినట్లు కూకట్పల్లి ఇన్స్స్పెక్టర్ నర్సింగరావు తెలిపారు.