Sunday, April 28, 2024

అంగరంగ వైభవంగా బోనాల పండుగ

- Advertisement -
- Advertisement -
  • గడి మైసమ్మకు మొక్కులు చెల్లించుకున్న మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: గడి మైసమ్మ ప్రజలందరిని చల్లంగా చూడు తల్లి అంటూ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అమ్మవారిని మొక్కుకున్నారు. ఆదివారం గడి మైసమ్మ బోనాల పండుగలో హాజరై మాట్లాడుతూ ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగా ఈ బోనాల పండుగను జరుపుకుంటున్నారని అమ్మవారి ఆశీస్సులతో ఈ కాలం తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, మంచి పంటలు పండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. ప్రతియేటా ఆషాడ మాసం పురస్కరించుకొని జరిపే బోనాల ఉత్సవాల్లో భాగంగా ప్రప్రథమంగా వైశ్యుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ బోనాల ఉత్సవంలో వందలాది మహిళలు పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ ధర్మవరం బ్రహ్మం పర్యవేక్షణ, వైశ్య నిర్వాహకులు కూర శ్రీనున, స్వప్న ఆధ్వర్యంలో లాల్ కమాన్ గుడి మైసమ్మ బోనాల ఉత్సవం కనుల పండువగా జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News