Wednesday, May 8, 2024

ఫోన్ లాక్కున్నారని బాలుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Boy committed suicide in Kukatpally

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో బాలుడు గేమ్ ఆడుతుండగా మొబైల్ ఫోన్‌ను లాక్కున్నారని మనస్థాపం చెంది ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన నగరంలోని కూకట్‌పల్లిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కూకట్‌పల్లికి చెందిన బాలుడు మణికంఠ(12)కు ఆన్‌లైన్ క్లాసులు ఉండడంతో తల్లిదండ్రులు మొబైల్ ఫోన్ కొనిచ్చారు. బాలుడు క్లాసులు వినకుండా పబ్జీ గేమ్ ఆడుతుండడంతో తల్లిదండ్రులు మొబైల్‌ను తీసుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన బాలుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News