Thursday, May 2, 2024

సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల వేతనాలు పెంపు

- Advertisement -
- Advertisement -

Increase in wages of workers and employees in security services

కేటగిరీల వారీగా కనీస మూల వేతనాలను నిర్ణయిస్తూ కార్మిక శాఖ ఉత్తర్వులు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో సెక్యూరిటీ సేవల విభాగంలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగుల కనీస వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. కేటగిరీల వారీగా కనీస మూల వేతనాలను నిర్ణయిస్తూ కార్మిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. హైస్కిల్ కేటగిరీ-1 కింద కనీస వేతనం రూ.39,837, కేటగిరీ-2 కింద రూ.35,254, కేటగిరీ-3 కింద రూ.31,199, కేటగిరీ-4 కింద రూ.27,610లుగా ఖరారు చేసింది. ఆయుధాలు ధరించిన సెక్యూరిటీ సిబ్బందిని ఈ కేటగిరీల్లోకి చేర్చారు. ఆయుధాలు లేకుండా ఉన్నవారిని స్కిల్ కేటగిరీలో పేర్కొంటూ రూ.24,434లుగా సూచించింది. అలాగే సెమీస్కిల్ కేటగిరీ వారికి రూ.21,623, అన్‌స్కిల్ కేటగిరీ వారికి రూ.18,019లుగా ఖరారు చేసింది. ఆయా ఉద్యోగులకు డీఏ పాయింట్ పెరిగిన కొద్దీ చెల్లించాల్సిన కరవు భత్యాన్ని కేటగిరీల వారీగా రూ.12 నుంచి రూ.26.54లుగా సూచించింది.

రాత్రివేళల్లో విధులు నిర్వహిస్తే 25 శాతం అదనం

ఉద్యోగులకు యాజమాన్య సంస్థలు పనిచేసే చోట ఆహారాన్ని అందిస్తే నెలకు రూ.540 వేతనం నుంచి మినహాయించవచ్చని, సెలవు రోజుల్లో పనిచేసే వారికి రెండింతల వేతనం ఇవ్వాలని స్పష్టం చేసింది. మహిళా, పురుష ఉద్యోగుల జీతాల్లో వ్యత్యాసాలు చూపొద్దని, ఇప్పటికే ప్రభుత్వం ఖరారు చేసిన కనీస వేతనం కన్నా ఎక్కువ వేతనం పొందితే అధిక వేతనాన్నే కొనసాగించాలని తెలిపింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు పనిచేసే ఉద్యోగులకు రాత్రి వేళ (నైట్ షిఫ్ట్) విధుల కింద 25 శాతం అదనంగా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News