- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: అపార్ట్మెంట్ సెల్లార్ నీటిటో మునిగి బాలుడు మృతిచెందిన సంఘటన నగరంలోని దిల్సుక్ నగర్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బుధవారం దిల్సుక్నగర్లోని సాహితీ అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీరు రావడంతో బాలుడి తండ్రి యుగేంధర్ ఇంట్లోనే ఉన్నాడు. ఉదయం సమయంలో అజిత్సాయి(౩) ఆడుకునేందుకు సెల్లార్లోకి వచ్చాడు. సెల్లార్లో నీరు ఉండడంతో ఆడుకుంటూ వెళ్లి అందులో పడిపోయాడు. అజిత్ వెళ్లిన విషయం గమనించి యుగంధర్ కిందికి వచ్చే సరికే నీళ్లల్లో పడిపోయాడు, గమనించిన తండ్రి వెంటనే ఆస్పత్రికి తరలించాడు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Boy dies after drawing in Cellar water in Dilsukhnagar
- Advertisement -