- Advertisement -
అమరావతి: చేతబడి చేస్తున్నారని నెపంతో పెద్దనాన్నను తమ్ముడి కుమారులు హత్య చేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గోగుబాకలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అయ్యవారి పేటలో రత్తయ్య అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రత్తయ్యకు తమ్ముడు కూమారులు ప్రసాద్,సత్యనారాయణ ఉన్నారు. రత్తయ్య చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో తమ్ముడి కూమారులు ఇద్దరు పెద్దనాన్నను చంపి గోదావరి తీరంలోని ఇసుకలో పూడ్చి పెట్టారు. మార్చి 5న రత్తయ్య అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ్ముడి కుమారులపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయాలు బయటపడ్డాయి. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని ఎటపాక సిఐ రామకృష్ణ మీడియాకు తెలిపారు.
- Advertisement -