- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలో శుక్రవారం ఉదయం కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లింది. లోల్లలాకుల వద్ద కారు కాలువలోకి దూసుకెళ్లడంతో ముగ్గురు గల్లంతు కాగా ఇద్దరు బయటపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడి చేరుకొని ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మరో ఇద్దరు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితులు పశ్చిమ గోదావరి జిలా భీమవరం వాసులుగా గుర్తించారు. వసంతవాడ తీర్థానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం.
- Advertisement -