Wednesday, May 8, 2024

లోక్‌స‌భ‌లో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం.. మద్దతు తెలిపిన మజ్లిస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్‌స‌భ‌లో కేంద్ర ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్డీఎ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సభ విశ్వాసాన్ని కోల్పోయిందని, ఆ మేరకు బీఆర్ఎస్ లోక్‌స‌భా పక్ష నేత నామా నాగేశ్వర రావు నోటీసులు ఇచ్చారు. అవిశ్వాస తీర్మానాన్ని బిజినెస్ లిస్టులో చేర్చాలని కోరారు.

లోక్‌సభలో రూల్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్‌లోని 17వ అధ్యాయంలోని రూల్ 198 (బి) కింద, ఈ క్రింది తీర్మానాన్ని సభలోకి తీసుకురావాలని బీఆర్ఎస్ నోటీసు ఇచ్చింది. ఇవాళ సవరించిన బిజినెస్ లిస్ట్ లో తీర్మానాన్ని చేర్చవలసిందిగా ఆ పార్టీ కోరింది. దీనికి ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లమీన్ (ఎఐఎంఐఎం) పార్టీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు బీఆర్ఎస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం ప్రతిపై ఎఐఎంఐఎం అధినేత, లోక్‌స‌భ‌ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ సంతకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News