Friday, May 3, 2024

అక్షయ తృతీయకు ‘ఫోన్‌పే’తో బంగారం కొనుగోలు

- Advertisement -
- Advertisement -

Akshaya tritiya

 

న్యూఢిల్లీ: భారతదేశంలో ఒక అగ్రగామి డిజిటల్ పేమెంట్ వేదిక ఫోన్‌పే అక్షయ తృతీయకు బంగారం కొనుగోలు అవకాశాన్ని కల్పిస్తోంది. ఫోన్‌పేతో వినియోగదారులు నగదు పంపడం, స్వీకరించడం, మొబైల్, డిటిహెచ్, డేటా కార్డులను రీఛార్జి చేయడం, వినియోగ బిల్లులు చెల్లించడం చేస్తున్నారు. ఇప్పుడు బంగారం కొనడం చేయవచ్చు. క్షణాల వ్యవధిలోనే ఫోన్‌పేలో బంగారాన్ని కొనవచ్చు. వినియోగదారులు 24 క్యారెట్లుగా (కె) ధృవీకరించిన బంగారాన్ని తక్కువ ధరకే పారదర్శకమైన రీతిలో ఫోన్‌పే యాప్ ద్వారా తమ ఇంటినుంచే కొనవచ్చు. యాప్‌లో బంగారం కొనుగోలు సాఫీగా జరిగేలా తన వినియోగదారులకు బంగారం మార్కెట్ ప్రదేశాన్ని రూపొందించడం కోసం భారతదేశంలో గుర్తింపు పొందిన బంగారు సంస్థలైన సేఫ్‌గోల్డ్, ఎంఎంటిసిపిఎఎంపిలతో ఫోన్‌పే భాగస్వామ్యం కుదుర్చుకుంది. కొనుగోళ్లపై వినియోగదారులు Rs.100 వరకు క్యాష్‌బ్యాక్ అందుకోవచ్చు. యాప్‌లో వినియోగదారులు కొనే బంగారం ఒక ఫ్రీ బ్యాంక్ గ్రేడ్ బీమా కలిగిన లాకర్ సౌకర్యంలో నిల్వ చేస్తారు.

 

Buying gold with phonepe for Akshaya tritiya
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News