- Advertisement -
కరోనా లాక్డౌన్తో సినీ స్టార్లు అందరూ ఇంట్లోనే ఉంటూ తమ కుటుంబంతో హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్స్టార్ మహేష్బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఇంట్లో సరదాగా గడుపుతున్నారు. మరోవైపు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సోషల్ మీడియాలో అభిమానులకు సందేశాన్నిస్తున్నారు. తాజాగా మహేష్ తన గారాలపట్టి సితారతో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పాటు ‘స్టే హోమ్. స్టే సేఫ్. స్టే స్ట్రాంగ్’ అంటూ అభిమానులకు సందేశాన్ని కూడా ఇచ్చారు. ప్రజలందరూ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని మహేష్ పేర్కొన్నారు.
Mahesh babu awareness on Corona
- Advertisement -