Thursday, May 2, 2024

ఈనెల 11వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  సికింద్రాబాద్ డివిజన్‌లో రైల్వే లైన్ల మరమ్మత్తులు, మెయింటెయిన్స్ పనుల్లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట- టు డోర్నకల్, భద్రాచలం రోడ్డు టు విజయవాడ, డోర్నకల్ టు -కాజీపేట, విజయవాడ- టు భద్రాచలం రోడ్డు, కాజీపేట- టు సిర్పూర్ టౌన్, సికింద్రాబాద్ టు -వరంగల్, వరంగల్- టు హైదరాబాద్, సిర్పూర్ టౌన్- టు కరీంనగర్ రైళ్లను రద్దు చేశారు. సోమవారం నుంచి ఈ నెల 10 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజవాయడ రైల్వే డివిజన్ పరిధిలో కూడా పలు రైళ్లను అధికారులు రద్దుచేశారు. గుంటూరు- టు విశాఖపట్నం, సింహాద్రి ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం- టు మచిలీపట్నం రైలును ఈ నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, విశాఖపట్నం టు -గుంటూరు రైలును 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు, విశాఖపట్నం టు -విజయవాడ, విజయవాడ టు విశాఖపట్నంల మధ్య నడిచే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ 5, 6, 8, 9 తేదీల్లో రద్దు చేశారు. ఇక గుంటూరు- టు రాయగడ ఎక్స్‌ప్రెస్, మచిలీపట్నం టు -విశాఖపట్నం, విశాఖపట్నం టు -లింగంపల్లి రైళ్లను ఈ నెల 9వ తేదీ వరకు, లింగంపల్లి- టు విశాఖపట్నం, రాయగడ- టు గుంటూరు, విజయవాడ టు -విశాఖపట్నం, -విశాఖపట్నం టు విజయవాడ రైళ్లను ఈ నెల 10వ తేదీ వరకు అధికారులు రద్దు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News