Tuesday, April 30, 2024

ఘనంగా బిపి మండల్ జయంతి వేడుకలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ /హైదరాబాద్: రాష్ట్ర బిసి కమిషన్ కార్యాలయంలో బిపి మండల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం మండల్ చిత్రపటానికి రాష్ట్ర బిసి కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్, శుభప్రద్ పటేల్ బిపి మండల్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిశోర్ గౌడ్ మాట్లాడుతూ బిపి మండల్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని వివరించారు. బిపి మండల్ వెనుకబడిన వర్గాల పక్షపాతి అని వెనుకబడిన వర్గాల వారి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనిదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News